త్వరలో విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ : మంత్రి జగదీశ్వర్ రెడ్డి

-

విద్యుత్ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. TSSPDCLలో కొత్తగా రిక్రూట్ అయిన 1,362 మంది లైన్ మెన్ లకు నిన్న హైదరాబాదులో నియామక పత్రాలు అందజేస్తారు. తమ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో విద్యుత్ సంస్థల్లో 35,774 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. అదే విద్యుత్ రంగం సాధించిన విజయాలతోటే ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామిక వేత్తలు తెలంగాణా కు తరలి వస్తున్నారన్నారు.

కను రెప్ప కొట్టినంత సేపు కుడా విద్యుత్ కొరత లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయే నన్నారు.డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేది కేవలం ఆరు గంటలేనని ఆయన ఎద్దేవాచేశారు.పరిశ్రమలకు ఇప్పటికీ పవర్ హాలిడేలు కొనసాగుతున్నాయాన్నారు.విద్యుత్ రంగం విజయాలలో లైన్ మెన్ ల పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయాన్ని కొత్తగా నియమితులైన ఉద్యోగులు విస్మరించ రాదన్నారు.రక్షణ చర్యలు తీసుకుంటూ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు.

Read more RELATED
Recommended to you

Latest news