హైదరాబాద్‌లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం

-

నేడు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో రాత్రికి రాత్రే పోస్టర్లు వెలవడం చేర్చనీయాంశంగా మారింది. ‘తెలంగాణ పుట్టుకను పదేపదే అవమానించిన ప్రధానికి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదు’ అంటూ పోస్టర్లను అతికించారు. ప్రధాని పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మాట్లాడిన మాటలను అందులో లెక్కించారు.

కాగా, నేడు తెలంగాణలోని మహబూబ్ నగర్ కు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు పర్యటన వివరాలు రిలీజ్‌ చేశారు అధికారులు. ఇక షెడ్యూల్‌ ప్రకారం.. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి మోడీ రానున్నారు. 1:35కి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌ నగర్‌ కి మోడీ రానున్నారు. మధ్యాహ్నం 2:05 గంటలకు పాలమూరుకు ప్రధాని చేరుకుంటారు. 2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news