తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో ఓపల్ సుచాత విజయం సాధించింది. నిన్న మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలను నిర్వహించారు. ఫైనల్స్ లోకి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అందరూ విచ్చేసి సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనుసూద్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇందులో మిస్ వరల్డ్ సుచాతను సోనుసూద్ ప్రశ్నించారు.

మీకు ఈ జర్నీ ఏం నేర్పించింది అని అడగ్గా…. ఆమె నా జీవితంలో దొరికిన గొప్ప అవకాశంగా దీనిని భావిస్తున్నానని అన్నారు. మిస్ వరల్డ్ అనేది చాలా గొప్ప అదృష్టం, బాధ్యత. ఎప్పుడైనా మనం చేసే పనులు గొప్పవై ఉండాలి. ఎందుకంటే మనం ఎలాంటి స్థాయిలో ఉన్నప్పటికీ మన చుట్టూ ఉన్నవాళ్లు, మన పిల్లలు, కుటుంబ సభ్యులు ఎవరైనా మనల్ని ఎలా చూస్తున్నారో అనేది చాలా ముఖ్యమని ఓపల్ సుచాత చెప్పి అక్కడ ఉన్న వారందరి మనసును గెలుచుకుంది. ఈ ఒకే ఒక్క సమాధానంతో ఓపెల్ సుచాత మిస్ వరల్డ్ గా ఎంపికైంది.
కాగా మిస్ వరల్డ్ విన్నర్ కు 8.5 కోట్ల ప్రైస్ మనీ ఇచ్చారు. అలాగే 1770 వజ్రాలు పొందిన కిరీటం అందించారు. ఇవే కాకుండా లండన్ లో ఏడాది పొడవు నివాసం, డిజైనర్ కాస్ట్యూమ్స్ వార్డ్ రోబ్, నగలు అలాగే చెప్పులు అటు మేకప్ కిట్స్ కూడా అందిస్తారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టులతో ప్రపంచమంతా పర్యటించవచ్చు. ఏం డబ్ల్యూ ఓ దాతృత్వ కార్యక్రమాలకు స్పాన్సర్ గా వ్యవహరిస్తారు.