కేసీఆర్ కు షాక్.. ఇక కొత్త కండువాతో కవిత !

-

గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవిత తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు ఏ మాత్రం తీసిపోకుండా జాగృతి కార్యకలాపాలు జరుగనున్నాయి. నిన్న నూతన జాగృతి కార్యాలయం ప్రారంభించారు కవిత. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భీమ్, జై జాగృతి నినాదాలతో గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవిత ముందుకు వెళుతున్నారు.

kavitha kcr
big Shock for KCR Kavitha with a new scarf

ఎక్కడా బీఆర్ఎస్ మాట ఎత్తని కల్వకుంట్ల కవిత… జై తెలంగాణ, జై కేసీఆర్, జై భీమ్, జై జాగృతి నినాదాలతో ముందుకు వెళుతున్నారు. కార్యాలయం ప్రారంభోత్సవంలో కూడా కనిపించలేదు గులాబీ జెండాలు. జాగృతి కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు భారాస నేతలు. అంతేకాదు ఇక పై ఎమ్మెల్సీ కవిత.. గులాబీ కండువా లేకుండానే పనిచేస్తారు. కొత్త కండువాతో కనిపించారు ఎమ్మెల్సీ కవిత.

Read more RELATED
Recommended to you

Latest news