నార్సింగి ఔటర్ రింగు రోడ్డు పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

-

హైదరాబాద్‌ మహా నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి ఔటర్ రింగు రోడ్డు పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ నార్సింగి ఔటర్ రింగు రోడ్డు పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. నార్సింగి ఔటర్ రింగు రోడ్డు పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ తరుణంలోనే… బస్సు చెక్రాల కింద పడి ఇద్దరు వ్యక్తులు నలిగి పోయినట్లు తెలిపారు పోలీసులు.

ORR F Morning Star private travel bus overturned

బస్సులో ప్రయాణిస్తున్న పలువురుకి తీవ్ర గాయాలు అయినట్లు కూడా వివరించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు వాహనదారులు. దీంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా అయిందని చెబుతున్నారు పోలీసులు. హైదరాబాద్ నుండి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబాయి వెళుతున్న మార్నింగ్ స్టార్ బస్సుకు ఈ ప్రమాదం జరిగిందని….ఆ బస్సు పంజాబ్‌ కు చెందినది గా గుర్తించారు. బస్సులో పలు కుటుంబాలు ఉన్నాయని…. క్రేన్ సహాయంతో బస్సును తొలగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news