తెలంగాణలో వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు!

-

రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం వర్షాలు దంచి కొడతాయని ఇటీవలే వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ నేపథ్యంలో రైతులు వరి, పత్తిని పెద్ద ఎత్తులో సాగు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. దాదాపు 65 లక్షల ఎకరాల్లో వరి,  60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారని భావిస్తున్నారు. ఇందుకు ఇప్పటి నుంచే వ్యవసాయ శాఖ వానాకాలం సీజన్​ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం 1.50 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.

వ్యవసాయ శాఖ వానాకాల ప్రణాళికలో రాష్ట్రంలో ముందస్తు వాతావరణ పరిస్థితులు, మార్కెట్లలో లభించిన ధరలు, వాతావరణ పరిస్థితులు అంచనాల ప్రాతిపదికన తీసుకుంది. గత వానాకాలం సీజన్​లో రాష్ట్రంలో వరి 64 లక్షల ఎకరాల్లోనూ, పత్తి 44.77 లక్షల ఎకరాల్లోనూ సాగు చేయగా.. యాసంగిలో మాత్రం వర్షాభావం, సాగునీరందక ఆశించిన మేర సాగు కాలేదనే చెప్పాలి. ఈసారి మంచి వర్షాలే ఉంటాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఈ రెండు పంటలు గత ఏడాది వానాకాలం సీజన్​కు మించి సాగయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news