ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వాదం తీసుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి

-

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికు రావడం తో హరీష్ రావు సమక్షం లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నెల 16వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో సీఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ నేపధ్యంలో జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశానికి హాజరు అవడం సంతోషంగా ఉందని ఈ సందర్బంగా హరీష్ రావు పేర్కొన్నారు.

Palla Rajeshwar Reddy who took the blessings of Muthireddy Yadagiri Reddy

జనగాంలో ఎంట్రీతోనే అద్భుతమైన విజయం సాధించే దిశగా సాగుతున్న రెడ్డి గారికి శుభాకాంక్షలు….కెసిఆర్ కు జనగామంటే చాలా ప్రేమ. జనగామ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూశారు.తెలంగాణ ఉద్యమానికి పోరు గడ్డ జనగామ ప్రాంతం అని కొనియాడారు. పెద్ద మనసుతో పల్ల రాజేశ్వర్ రెడ్డిని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వదించడమే కాకుండా భవిష్యత్తులో చేయాల్సిన పనుల బాధ్యతను అప్పగించారు… సూర్యాపేట జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి అనే విద్యార్థి 2010 లో ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్, బిజెపి ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య చేసుకొని అమరుడయ్యాడన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news