వరంగల్ ఎంజీఎంలో కరెంట్ పోయి వెంటిలేటర్ మీదున్న రోగి మృతి!

-

తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ పోయి వెంటిలేటర్ మీదున్న రోగి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. దీనికి సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయ్. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరెంట్ పోయి వెంటిలేటర్ మీదున్న రోగి మృతి చెందాడు.

Patient on ventilator dies due to power failure in Warangal MGM Hospital

వరంగల్ – ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి నుండి విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పనిచేయక శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బిక్షపతి(45) అనే వ్యక్తి మృతి చెందాడు.కరెంట్ పోవడంతో జనరేటర్ ఆన్ చేయగా అది పని చేయలేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా వెంటిలేటర్ ఆఫ్ అయి బిక్షపతి మృతి చెందాడు. ఇప్పుడు ఈ సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version