మంత్రిగా నేడు పట్నం మహేందర్‌రెడ్డి  ప్రమాణ స్వీకారం

-

నేడు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈ విస్తరణలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అమాత్యుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ విషయాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి ఎక్స్ (ట్విటర్‌) ద్వారా బుధవారం వెల్లడించారు. మహేందర్‌ రెడ్డికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈటల రాజేందర్‌ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత… ఆ స్థానం ఇప్పటివరకు అలాగే ఖాళీగా కొనసాగింది. అయితే ఆయన స్థానంలో తాజాగా మహేందర్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించడంతో… ఆ మేరకు ప్రభుత్వం నుంచి గవర్నర్‌ కార్యాలయానికి సమాచారం వెళ్లింది. దీంతో మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణం చేయడానికి అవసరమైన ఏర్పాట్లను చేపట్టినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు ధ్రువీకరించాయి. ఆయనకు ముఖ్యమంత్రి ఏ శాఖను కేటాయిస్తారనేది గురువారం వెల్లడవుతుంది. దాదాపుగా ఆరోగ్య శాఖ ఖరారు అనే మాట బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news