బీఆర్ఎస్ ను పొలిమేరలో బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు – మల్లు రవి

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కల్పాలని సీఎం కేసీఆర్ మాట్లాడడం తల్లి పాలు తాగి, తల్లి రొమ్ము గుద్దినట్టుగా ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలనడం కేసీఆర్ నమ్మకద్రోహానికి నిదర్శనం అని విమర్శించారు. మోసగాడిగా మాట్లాడుతున్న కెసిఆర్ పార్టీ బీఆర్ఎస్ ను పొలిమేరలో బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని అన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో బిజెపికి పట్టిన గతే తెలంగాణలో కేసీఆర్ కు కచ్చితంగా పడుతుందన్నారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ఉన్న కేసీఆర్ ను గద్దె దింపడానికి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ ఉద్యమంలా మారిందన్నారు మల్లు రవి. తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు రోడ్లపైకి వచ్చి చేసిన వంటావార్పు లాంటి ఉద్యమాలు ఇప్పుడు పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో మళ్లీ మొదలయ్యాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version