నేడు కోటి దీపోత్సవంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ

-

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ మూడ్రోజుల తెలంగాణ రాష్ట్ర పర్యటన ఇవాళ జరిగే రోడ్ షోతో ముగియనుంది. తిరుమల నుంచి మోదీ.. తొలుత హెలికాప్టర్‌లో మహబూబాబాద్‌కు వెళ్లి.. అక్కడ ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్‌ ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

 

Prime Minister Narendra Modi 

అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్న ప్రధాని మోదీ.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడలోని వీర సావర్కర్ విగ్రహం వరకు రోడ్ షో చేయనున్నారు. సాయంత్రం 5నుంచి 6 గంటల వరకు 2 కిలోమీటర్ల పొడవునా ప్రధాని మోదీ రోడ్ షో జరగనుంది. ఇక ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news