ఈ నెల 11న తెలంగాణకు ప్రధాని మోడీ..కేసీఆర్‌ ఎఫెక్టేనా !

-

BREAKING : దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. HICC లో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు.. ప్రధాని రానున్నారు. ఈ నెల 10 నుంచి 14 వరకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (UNWGIC 2022) సదస్సు జరుగనుంది.

ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ రానున్నారు. ఇక సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్‌ ప్రకటన తర్వాత మోడీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. దీంతో అందరి చూపు తెలంగాణ వైపే ఉంది. అయితే.. ప్రధాని మోడీ.. అధికారిక కార్యక్రమనికే పరిమితం అవుతారా ? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా అనే దానిపై ఉత్కంఠత నెలకొంది. పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ ఉండవచ్చని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news