పెద్దఅంబర్ పేట్ లో కలకలం.. దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసుల కాల్పులు

-

హైదరాబాద్‌ శివారిలోని పెద్దఅంబర్‌పేట సమీపంలో పోలీసుల కాల్పులు కలకలం సృష్టించాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద గాల్లోకి నల్గొండ సీసీఎస్‌ పోలీసుల కాల్పులు జరిపారు. దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల జాతీయరహదారిపై పార్కింగ్‌ వాహనాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన నల్గొండ పోలీసులు ఈ మార్గంలో నిఘా పెట్టారు. నల్గొండ ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున పెట్రోలింగ్‌ పోలీసులు హైదరాబాద్ శివారు పెద్ద అంబర్పేట సమీపంలో దొంగల ముఠాను గుర్తించి వారిని వెంబడించారు.

దొంగల ముఠాను వెంబడించిన నల్గొండ సీసీఎస్‌ పోలీసులు.. రాచకొండ పరిధిలోకి వచ్చాక ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తంగా దొంగలను పట్టుకునే క్రమంలో వారు పోలీసులపై కత్తులతో ఎదురుదాడికి తెగబడ్డారు. ఈ క్రమంలోనే గాల్లోకి కాల్పులు జరిపి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news