ఎనిమిదో వింతగా బుమ్రా.. పిటిషన్‌పై సంతకం చేస్తానన్న కోహ్లీ

-

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎనిమిదో వింతగా ప్రకటించాలని.. ఆ పిటిషన్పై తాను సంతకం చేస్తానని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. టీ20 ప్రపంచ కప్‌ను టీమ్‌ఇండియా సొంతం చేసుకోవడంలో జస్‌ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర అని తెలిపాడు. టీ20 ప్రపంచ కప్ గెలిచి భారత్కు చేరుకున్న టీమిండియా ముంబయిలో విక్టరీ పరేడ్ నిర్వహించిన తర్వాత వాంఖడే మైదానంలో క్రికెటర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బుమ్రా గురించి కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఫైనల్‌ సందర్భంగా నేను కూడా ఒక దశలో మరోసారి కప్‌ చేజారిపోతుందా? అనుకున్నా. అయితే, చివరి ఐదు ఓవర్లలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఆ రెండు ఓవర్లు అద్భుతం. ఎంతో ప్రత్యేకం. ప్రతిసారి మ్యాచ్‌లో మనల్ని విజయం వైపు నడిపించిన బుమ్రాపై వెల్లువెత్తిన ప్రశంసలు ఆనందం కలిగించాయి. ఎంతకాలం భారత జట్టు తరఫున ఆడాలని అతడు అనుకుంటాడో.. అప్పటి వరకు ప్రాతినిధ్యం వహించాలి. అంతేకాకుండా బుమ్రాను ఎనిమిదో వింతగా ప్రకటించాలనే పిటిషన్‌పై నేను సంతకం చేస్తా. తరానికి ఒక్కరు మాత్రమే ఇలాంటి బౌలర్‌ ఉంటాడు’’ అని విరాట్‌ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news