మియాపూర్ ప్రభుత్వ స్థలం వివాదంపై పోలీసులు కీలక ప్రకటన

-

మియాపూర్ ప్రభుత్వ స్థలం వివాదంపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ వివాదంపై మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ…మియాపూర్ ప్రభుత్వ స్థలంలోకి ఎవరు రాకూడదు…అందర్నీ కాళీ చేయించి పంపించి వేసామని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి చాలా మంది ప్రజలు ప్రలోభాల గురై వస్తున్నారని వెల్లడించారు. ఇది ప్రభుత్వ స్థలం సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని మాదాపూర్ డీసీపీ వినీత్ పేర్కొన్నారు.

Police key statement on Miyapur government land dispute

ఎవరైతే ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ స్థలం పైకి తీసుకువస్తున్నారో అలాంటి వారిని గుర్తిస్తున్నామని… ఈ వివాదంపై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేశాము, దర్యాప్తు చేసి మరికొన్ని కేసులు నమోదు చేస్తామన్నారు. ఎవరో కొందరు కావాలనే ఓ వర్గం వారిని రెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు మాదాపూర్ డీసీపీ వినీత్. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది…కొందరు ఆకతాయిలు కావాలని రాళ్లు విసిరారు. వారిని గుర్తిస్తామన్నారు. గడచిన మూడు రోజుల నుంచి వివాదం నడుస్తోందని… ఇంటిలిజెన్స్ రిపోర్ట్ మేరకు చర్యలు తీసుకున్నామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version