కొత్తకోట దయాకర్ రెడ్డి మృతిపట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం

-

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌ రెడ్డి ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇతర బీఆర్ఎస్ నేతలు దయాకర్‌రెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కొత్తకోట కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం కలిగించాలని కోరారు.

దయాకర్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దయాకర్ మృతితో మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు పరిష్కరించేవారని అన్నారు. దయాకర్ రెడ్డి మృతి పట్ల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version