జులై 12-19 మధ్య చంద్రయాన్‌-3 ప్రయోగం

-

ఇస్రో శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. జులై 12 నుంచి 19 మధ్య చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని చేపడతామని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. నిర్దేశించిన పరీక్షలన్నీ సాఫీగా సాగితే ఈ ప్రయోగం చేపడతామని వెల్లడించారు. ఆ తర్వాత కూడా ప్రయోగాన్ని చేపట్టవచ్చని, అయితే ఇందుకు ఇంధనాన్ని ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే చంద్రయాన్‌-3 వ్యోమనౌక శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రానికి చేరుకుందని వివరించారు.

‘‘తుది ఏర్పాట్లు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. చంద్రయాన్‌-3 ప్రయోగానికి ఎల్‌వీఎం-3ని ఉపయోగిస్తాం. దాని కూర్పు పని సాగుతోంది. దానికి సంబంధించిన భాగాలన్నీ శ్రీహరికోట చేరుకున్నాయి’’ అని సోమనాథ్‌ తెలిపారు. రాకెట్‌ కూర్పు ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఆ తర్వాత చంద్రయాన్‌-3ని రాకెట్‌తో అనుసంధానిస్తామని వెల్లడించారు. దీని ప్రయోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు వ్యోమనౌకలో అనేక మార్పులు చేపట్టామని అన్నారు. ఎక్కువ సౌరశక్తిని ఒడిసిపెట్టేలా పెద్ద సోలార్‌ ప్యానెల్స్‌ అమర్చినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version