BRS నుంచి 20 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు – పొంగులేటి

-

భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… భారత రాష్ట్ర సమితి నుండి ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు అలాగే మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బాంబు పేల్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో 10 సీట్లకు 10 సీట్లు గెలుస్తుందని… తెలంగాణలో మొత్తం 100 సీట్లు గెలవబోతుందని జోష్యం చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాగా రెండు రోజుల కిందట రాహుల్ గాంధీ సమక్షంలో… కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news