పైసల్లేవ్ అందుకే.. తులం బంగారం ఇవ్వలేకపోతున్నాం – మంత్రి పొంగులేటి

-

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పైసల్లేవ్ అందుకే.. తులం బంగారం ఇవ్వలేకపోతున్నామని కుండ బద్దలు కొట్టి చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ నెలలోనే ప్రతి నియోజకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ప్రకటించారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… పీఎస్సార్ ట్రస్టు నుంచి ప్రభుత్వ స్కూల్ లో చదివే విద్యార్థినిలకు సైకిళ్ళు ఇస్తున్నామన్నారు.

గత పది సంవత్సరాలు పాలించిన పార్టీ కాకి గోల పెట్టిన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని వెల్లడించారు. ఆర్ధికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని… ప్రతిపక్ష పార్టీలు వారి ఉనికిని కాపాడుకోడానికి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఆడబిడ్డకు ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని.. రెండు లక్షల రుణమాఫీ18 వేల కోట్ల చేసామని గుర్తు చేశారు. ఇంకా 13 వేల కోట్ల రూపాయలు చేయాల్సి ఉందని.. భవిష్యత్ లో కూడా మీ దీవెనలు ఉండాలిని కోరారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news