బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. కాంగ్రెస్ 100 రోజుల వైఫల్యాలపై పోస్టు కార్డు ఉద్యమం

-

బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాలపై పోస్టు కార్డు ఉద్యమం చేపట్టనుంది గులాబీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు బోనస్, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చాకే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఓట్లు అడగాలని సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు పంపుతామని స్పష్టం చేశారు హరీష్ రావు.

పేరు గొప్ప ఊరు దిబ్బలాగా వాస్తవాలు మరుగున పడేసి, ఆర్భాటపు ప్రకటనలే పరిమితం అయింది అని విమర్శించారు. మాటల్లో వికసిత్ భారత్ – చేతల్లో విభజిత్ భారత్ అని మరోసారి బీజేపీ నిరూపించింది అని మండిపడ్డారు.మాటల గారడీ తప్ప, చేతల్లో చేసేదేమీ లేదని బిజెపి మేనిఫెస్టో తేల్చిచెప్పింది అని అన్నారు.మహిళలు, యువకులు, పేదలు, రైతులే తమకు ప్రధానమని చెప్పినా, ఈ నాలుగు వర్గాలను కూడా బీజేపీ విస్మరించింది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version