Prashanth Reddy: అవినీతికి రాజు ప్రధాని మోదీ

-

ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నేడు వరంగల్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో బీఆర్ఎస్ పార్టీపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. దేశంలో అవినీతికి రాజు ప్రధాని మోదీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రముఖ జాతర్లలో ఒకటైన మేడారం జాతరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని వారు.. నేడు వరంగల్ వచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది ట్రైలర్ అని బెదిరించేవారు ప్రధాని అవుతారా..? అని ప్రశ్నించారు. బిజెపి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటే మరో 50 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version