Telangana: డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి..!

-

Pregnant woman died due to negligence of doctors: డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి చెందింది. దీంతో ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం భీంపురానికి చెందిన గర్భిణీ గోవిందమ్మ (36) ప్రసవం కోసం మద్దూరు ప్రభుత్వ దవాఖానలో చేరింది.

Pregnant woman died due to negligence of doctors

కానీ అక్కడి వైద్యులు కష్టంగా ఉంది వేరే దవాఖానకు వెళ్లాలని సూచించారు. దీంతో నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా.. ఆపరేషన్ చేస్తున్న క్రమంలో గుండెపోటుకు గురై మృతి చెందింది. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news