ఎన్నికలకు సిద్ధం కండి – జేపీ నడ్డా

-

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బిజెపి నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. నేడు హైదరాబాద్ కి వచ్చిన ఆయనకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం నోవాటెల్ హోటల్ లో బిజెపి నేతలతో సమావేశం అయ్యారు నడ్డా. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా నేతలు పనిచేయాలని సూచించారు. ఇక నేతలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ తో రాజీపడేది లేదని.. ఆ పార్టీతో సీరియస్ ఫైట్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక జేపీ నడ్డా తో సమావేశమైన వారిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ముఖ్య నేతలు రఘునందన్ రావు, విజయశాంతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మురళీధర్ రావు తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version