నల్గొండ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. 30 మంది ప్రయాణికులు..?

-

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు జగిత్యాల నుంచి దర్శి వెళ్తుండగా నల్గొండ జిల్లాలోని అద్దంకి – నార్కెట్‌పల్లి ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్‌ సాయంతో ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. అతివేగంగా వెళ్లడం వల్ల అదుపుతప్పడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news