కాంగ్రెస్ సోషల్ మీడియా మీటింగులో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు !

-

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీటింగులో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు మెరిశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీటింగులో పాల్గొని ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు…మాట్లాడారు. దీనిపై సోషల్ మీడియాలో ప్రజలు మండిపడుతున్నారు.

Professor Nageshwar Rao participated in the social media meeting of the Congress party and spoke

ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో మనకు ఎదురుగాలి ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారట. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు మన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రచారం చేస్తున్నారు. దాన్ని మీరంతా గట్టిగా తిప్పికొట్టాలని ఆదేశించారట. మీకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది ఎందుకు? అని ప్రశ్నించారట.

రేవంత్ రెడ్డి మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతుంటే మనం ఎవరం పట్టించుకోవడం లేదు అని మనల్ని బదనాం చేస్తున్నారు. కనీసం ఆ సోషల్ మీడియాలో అన్నా వాళ్ళ ప్రచారం తిప్పి కొట్టండి. వీళ్ళ మీద కేసులు పెట్టండి అని కొన్ని ప్రతిపక్ష పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ చూపించారట మహేష్ కుమార్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news