కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగ

-

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగ తగిలింది. గో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య అంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల కేంద్రంలో నిరాహార దీక్షకు కూర్చున్నారు నవాబ్ పేట్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, నాయకులు సాయి కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.

Protest against MLA Kale Yadaiah, who joined the Congress

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అని చెప్పిన ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం హాస్యాస్పదం అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. యాదయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించాడు. యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని నిప్పులు చెరిగారు నవాబ్ పేట్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Latest news