సబితమ్మ ఇప్పుడే నిద్ర లేసింది…పాఠశాలల బంద్ పై రఘునందన్ కౌంటర్ !

-

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు అంటే గురువారం మరియు శుక్రవారం సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అయితే.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేసిన ప్రకటనపై రఘునందన్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు.

పిల్లలు స్కూల్ వెళ్లిన తర్వాత నిద్ర లేచి విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూనే ఆమెకు చురకలు అంటించారు రఘునందన్‌ రావు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను చూస్తూ ఉదయం 9 గంటలకు స్పందించి సెలవులు ప్రకటించాలని ఈరోజు ఫాంహౌజ్ నుండి ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ సీఎం కేసీఆర్‌ పై కూడా సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news