కేసీఆర్ మంచోడు కాబట్టి ఆ మాత్రం సీట్లు వచ్చాయి…జగన్ కు 15 సీట్లు కూడా రావు !!

-

తనపై అక్రమ కేసులు బనాయించిన వారు, తన అరెస్టుకు సహకరించిన వ్యక్తులు అధికారంలో నుంచి దిగిపోగా, అసలు కారకుడు కూడా త్వరలోనే స్మాష్ అవుతారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. అతనికి 15 సీట్లకు మించి రావని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచివారు కాబట్టి ఆయనకు ఎక్కువ సీట్లు వచ్చాయన్న రఘురామకృష్ణ రాజు గారు… తెలంగాణ పోలీసులు తనపై అక్రమ కేసు బనాయించడంలో, అరెస్టుకు సహకరించడంలో ఆయన పాత్ర లేదని ఇంకొక రావు పాత్ర ఉన్నదన్నారు.

ఈరోజు ఆనందంగా ఉందని, చెప్పడానికి వీలు లేనంత ఆనందంగా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ సాధించిన అప్రహతీత విజయం ఒక కారణమైతే, తన సహచర పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిందన్నారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ముందుగా చెప్పినట్లుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news