ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దాదాపు అన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని కూడా వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల అనంతపురం, శ్రీ సత్య సాయి, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. అనవసరంగా బయటికి రాకూడదని తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ లో చాలా జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.