తెలంగాణలో రాగల రెండ్రోజులు వర్షాలు

-

దాదాపు వారం రోజుల గ్యాప్ తర్వాత హైదరాబాద్ మహానగరాన్ని మళ్లీ వరణుడు పలకరించాడు. గురువారం సాయంత్రం నుంచి పలు చోట్ల చిరుజల్లులు కురిశారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు హైదరాబాద్ లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

మరోవైపు బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైద‌రాబాద్‌లోని కొన్ని చోట్ల గురువారం సాయంత్రం తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు కుత్బుల్లాపూర్‌ మండలం పరిధిలోని గాజుల రామారంలో అత్యధికంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్‌ అధికారులు వెల్లడించారు. జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, మహదేవ్‌పురం, మచ్చ బొల్లారం తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 30.3డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25.0డిగ్రీలు, గాలిలో తేమ 66 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version