BREAKING: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌ బామ్మర్ది !

-

BREAKING: జన్వాడ ఫాంహౌజ్‌ కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్‌ బామ్మర్ది రాజ్ పాకాల. తాజాగా హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యములో హైకోర్టును ఆశ్రయించారు రాజ్ పాకాల.

Raj Pakala lunch motion petition filed in High Court

ఈ మేరకు హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిగే ఛాన్స్ ఉంది. ఇక అటు జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ పైన గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు క్లారిటీ ఇచ్చారు. అది ఫామ్ హౌస్ కాదని తన బామ్మర్ది… ఇల్లు అంటూ పేర్కొన్నారు కేటీఆర్. రాజకీయంగా మాకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదని పేర్కొన్నారు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక.. మా బంధువులపై కుట్రలు చేస్తోందని రేవంత్ సర్కార్ పై ఆగ్రహించారు.

Image

Read more RELATED
Recommended to you

Latest news