ముసలోళ్లను చూస్తేనే వణుకు పుడుతుంది..రాజగోపాల్ రెడ్డి వీడియో వైరల్

-

మునుగోడు ఉపఎన్నిక చాలా హాట్ హాట్ గా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులతో ప్రచారాన్ని హోరెత్తుస్తున్నాయి. ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా చూసుకోవడమే లక్ష్యంగా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అలాగే అందివచ్చిన అవకాశాలని వదులుకోకుండా..ప్రత్యర్ధులకు చెక్ పెట్టే దిశగా పనిచేస్తున్నాయి.

ఓటర్లకు ఊహించని విధంగా తాయిలాలు పంచుతున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. గ్రామాల్లో నిరసన సేగలు, పోస్టర్ల కలకలం ఇక ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు… ఆయన కొత్త తంటాలు తెచ్చిపెట్టాయి. మునుగోడు నియోజకవర్గంలో నిన్న ప్రచారం నిర్వహించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

ఈ సందర్భంగా మునుగోడు ముసలోళ్ళను చూస్తే తనకు వలపు పుడుతోందంటూ వ్యాఖ్యానించారు. మునుగోడు ముసలోళ్ళు… కారు గుర్తుకే ఓటేస్తామని చెబుతున్నారని… వారితోనే పెద్ద పరేషాన్ వచ్చిందంటూ… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను క్యాష్ చేసుకున్న టిఆర్ఎస్ పార్టీ.. తెగ వైరల్ చేస్తోంది. ఇక ఇవాళ ఈ పెన్షన్ల పైనే చండూరు మండలంలో పోస్టల్ కూడా వెలిశాయి.

Read more RELATED
Recommended to you

Latest news