నేను సచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్లను – రాజాసింగ్‌

-

నేను సచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్లనని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ప్రకటన చేశారు. నా ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు పోను.. తెలంగాణను హిందూ రాష్ట్రం చేయాలనేది నా లక్ష్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. బీజేపీ నాకు టికెట్ ఇవ్వకుంటే..రాజకీయలు పక్కన పెట్టి నేను హిందు రాష్ట్రం కోసం పని చేసుకుంటానని ప్రకటించారు.

గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది..అందుకే పెండింగ్ పెట్టారన్నారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని తెలిపారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ..ఇండిపెండెంట్ గా కానీ వేరే పార్టీల నుంచి పోటీ చేయను…బీజేపీ అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది.. సరైన సమయం చూసి నాపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని స్పష్టం చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌.

Read more RELATED
Recommended to you

Latest news