హిందువు నాగరాజును చంపిన వాడికి ఉరిశిక్ష పడాలి – రాజాసింగ్‌

-

హిందువు నాగరాజును చంపిన వాడికి ఉరిశిక్ష పడాలని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజును హత్య చేయడంపై ఖండిస్తున్నట్లు ఒక మీటింగ్ లో అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారని… ముస్లిం అమ్మాయి.. హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో నుంచి బహిష్కరిస్తే బాగుండేదని ఆగ్రహించారు. కానీ అలా మర్డర్ చేయడం బాగోలేదని ఓవైసీ అన్నాడు… కానీ ఇదంతా షోకుటాప్ ముచ్చట్లేనని చురకలు అంటించారు.

మనసులో ఉంది ఒకటి… నోటి నుంచి వచ్చింది ఒకటని.. నాగరాజును హత్య చేసిన వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి ఉరిశిక్ష వేయించాలని ఓవైసీ మాట్లాడితే బాగుండేదన్నారు రాజాసింగ్‌. ఓవైసీ, ఎస్సీ కమిషన్ ను, సంఘాల నేతలను నేనొక్కటే కోరుతున్నా.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నాగరాజును హత్య చేసిన వారు ఎంత మంది ఉన్నా అందరికీ ఉరిశిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు. అడ్వకేట్లు నిందితుల తరుపున బెయిల్ కూడా ఇవ్వొద్దు.. ఎవరూ కేసును వాదించవద్దని కోరుతున్నానని.. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు ఉరిశిక్ష పడాలన్నారు. అప్పుడే ఇతరులు భయపడుతారు. మరోసారి ఇలాంటి పరిస్థితి జరగడానికి అవకాశం ఉండదని వెల్లడించారు రాజాసింగ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version