ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత, రేవంత్ రెడ్డి పార్టనర్లు – కోమటి రెడ్డి సంచలనం

-

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో టేప్‌ వివాదంపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తన సోదరుడు వెంకట్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ రాజగోపాల్ రెడ్డి… తన సోదరుడు ప్రజల కోసం కష్టపడే వ్యక్తి అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యిందని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి సీఎం కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారన్నారు. ఏడ్చే మగాడిని.. కాంగ్రెస్ పార్టీ వారిని నమ్మవద్దని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కుమార్తె కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత, రేవంత్ రెడ్డి పార్టనర్లు అని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version