డిసెంబర్ 9న తొలి కేబినెట్ భేటీ: రేవంత్ రెడ్డి

-

Telangana : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాతో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘ఆ రోజున సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం తొలి మంత్రివర్గ సమావేశంలో గ్యారెంటీలపై చర్చిస్తాం. ఆ పథకాల అమలుపై తొలి సంతకం చేస్తాం’ అని తెలిపారు.

Revanth Reddy will vote in Kodangal

సీఎం కేసీఆర్ మరోసారి దొడ్డిదారిలో గెలవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కొడంగల్ లో ఓటేసిన అనంతరం ఈ వాక్యాలు చేశారు. కావాలనే పోలింగ్ రోజు నాగార్జున సాగర్‌ లాంటి ఘటనలకు తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ధికి సీఎం కేసీఆర్‌ పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version