కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500 వందలకే సిలిండర్

-

కర్నాటకలో అధికారంలోకి వస్తాం.. తెలంగాణలో అధికారం మాదేనని కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టిందని… కేవలం రానున్న దళితుల ఓట్లు కొల్లగొట్టడం కోసమేనన్నారు.

ఖమ్మం జిల్లాలో పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే సంకెళ్లు వేసి జైళ్లకు పంపించావ్ అని ఆగ్రహించారు రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం…కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 500 వందలకే సిలిండర్లను అందిస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి.ఈ మధ్య ఒకాయన పార్టీ మారినట్టు చెప్పుకున్నాడు.. అలాంటి ఎండుటాకులు ఎన్ని రాలినా నష్టం లేదు..ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ దత్తత తీసుకుంటుందన్నారు రేవంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version