కాంగ్రెస్ సభలో పల్లి బఠానీలు అమ్ముకోవడానికి వచ్చినంత మంది కూడా బిజెపి సభకు రాలేదు: రేవంత్ రెడ్డి

-

బిజెపి ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడే కాంగ్రెస్ కూడా కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. గతంలో తాము గజ్వేల్ లో మల్లికార్జున ఖర్గే తో సభ నిర్వహించిన రోజే ఆదిలాబాద్ లో అమిత్షాతో బీజేపీ సభ నిర్వహించిందని,ఖర్గే సభలో పల్లి బఠానీలు అమ్ముకోవడానికి వచ్చినంత మంది కూడా అమిత్ షా సభకు రాలేదని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి.

మోడీ పరేడ్ గ్రౌండ్ సభను, రాహుల్ గాంధీ వరంగల్ సభను పోల్చి చూస్తే తెలంగాణలో ఎవరికీ పట్టు ఉందో తెలిసిపోతుంది అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి నాయకులను ఆదేశించారు. కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతి బలైందని మండిపడ్డారు. ఇప్పటికైనా వరదల ప్రభావం దృశ్యా కేంద్రం సహాయక చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రికి ఆయన సూచించారు. ఈనెల 17 నుంచి వరద బాధిత ప్రాంతాల్లో సాయం అందిస్తామని తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లో పర్యటిస్తామని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news