నేడు నిర్మలా సీతారామన్ తో రేవంత్ రెడ్డి భేటీ !

-

నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా ఇవ్వవలసిన నిధులు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన మరో 1800 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నున ఈ సందర్భంగా కోరనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అపాయింట్‌ మెంట్‌ కోరారట రేవంత్‌ రెడ్డి.

అలాగే, యూపీఎస్సీ ఛైర్మన్ తో సీఎం రేవంత్ భేటీ అవుతారు. ఈ భేటీలో టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ ఛైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ కానున్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని మార్చడం కోసం యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ విధానాలు తెలుసు కోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వాహణలో వారు అవలంభిస్తున్న విధానాలు తెలుసుకొని టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news