మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి టికెట్ : రేవంత్ సంచలనం

-

మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు బీఆర్ఎస్‌లో ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువే ఇస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

మైనంపల్లి హన్మంతరావు పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. మైనంపల్లి హన్మంతరావుతో పాటు వేముల వీరేశం కూడా చేరుతున్నారని వెల్లడించారు. కేటీఆర్ కు ఆకలి ఎక్కువ..బుర్ర తక్కువ అని మండిపడ్డారు. Mlc కేటగిరి ఏంటి.. ఎవరిని నామినేట్ చేయాలో తెలుసుకోవాలని ఆగ్రహించారు. కేటీఆర్ లేవనెత్తిన ఎంపీ లు Mla కోటాలో రాజ్యసభ కి ఎన్నిక అయ్యారు…వాళ్ళ గురించి తెలుసుకోలేని బుర్ర తక్కువ వెధవ కేటీఆర్ అంటూ ఫైర్‌ అయ్యారు. Brs అవినీతి పై చర్చ జరిగే సందర్భంలో ఇలాంటి దిక్కుమాలిన చర్చ చేస్తాడని కేటీఆర్ పై మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news