హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

-

ఇటీవల రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక దగ్గర తెల్లవారుజామునే ఇలాంటి ప్రమాద వార్తలు వినాల్సి వస్తుంది. క్షణకాలంలో జరిగిపోతాయి రోడ్డు ప్రమాదాలు. అప్పటివరకు ఓ లెక్క.. ప్రమాదం తర్వాత మరో లెక్క. కాలం వెనక్కి వెళ్తే బాగుండని ప్రతిక్షణం ఆలోచన. చాలా రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణమైనప్పటికీ.. ప్రమాద బాధితుల్లో ఎక్కువమంది పేదలు, మధ్యతరగతి వారే ఉంటున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివారులలోని హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Road-Accident
Road-Accident

హయత్ నగర్ లోని వార్డ్ అండ్ డిడి స్కూల్ వద్ద ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన బస్సు ఆగి ఉన్న ఓ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు ఏపీలోని జంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news