దేశంలో ఆర్ఎస్ఎస్ రాజనీతి కొనసాగుతోంది – థాక్రే

-

దేశంలో ఆర్ఎస్ఎస్ రాజనీతి కొనసాగుతుందని ఆరోపించారు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మణిక్ రావు ఠాక్రే. ఆదివాసి, గిరిజనుల రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. దేశంలో ఆదివాసి, గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలోని ఆదివాసి, గిరిజనుల హక్కుల కోసం పోరాడేందుకు బెల్లయ్య నాయక్ ను కాంగ్రెస్ ఎంచుకుందని.. దేశంలో ఆదివాసీల కోసం పోరాడేందుకు శివాజీ రావు బోగే వంటి నాయకులు ఉన్నారన్నారు.

తెలంగాణలో జరగనున్న ఎన్నికలలో ఆదివాసి, గిరిజనులందరూ ఐక్యతతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు. లిక్కర్ స్కాం నుంచి ఎమ్మెల్సీ కవితను తప్పించడం చూస్తుంటే.. బీఆర్ఎస్ – బిజెపి ఒక్కటేనని అర్థమవుతుందన్నారు. అన్ని మతాలకు, కులాలకు సమప్రధాన్యత ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version