నేటి నుంచి సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు

-

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఇవాళ్టి నుంచి సమతా కుంభ్ – 2023 బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 14 వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జీవా ప్రతినిధులు పేర్కొన్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో సువర్ణమూర్తి భగవద్రామానుజులకు ఉత్సవారంభ స్నపనంతో వేడుకలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఇవాళ్టి కార్యక్రమాలు..

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విష్వక్సేన వీధి శోధన

మ.1.30 గంటలకు తీర్థ ప్రసాద గోష్ఠి

సా.5 నుంచి 5.45 వరకు సామూహిక విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం

సా.6 నుంచి 8.30 వరకు వేదికపై అంకురార్పణ వైనతేయ ప్రతిష్ఠ, త్రీర్థ ప్రసాద గోష్ఠి.

Read more RELATED
Recommended to you

Latest news