నాగర్ కర్నూల్ ఎంపీగా మల్లురవిని భారీ మెజారిటీతో గెలిపిస్తా – సంపత్ కుమార్

-

Sampath Kumar honored Mallu ravi : నాగర్ కర్నూల్ ఎంపీగా మల్లురవిని భారీ మెజారిటీతో గెలిపిస్తానని వెల్లడించారు ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎ సంపత్ కుమార్. తెలంగాణ నుంచి నలుగురు లోక్సభ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. అయితే..ఈ లిస్ట్‌ లో BRS నుంచి కాంగ్రెస్‌ లో చేరిన బొంతు రామ్మోహన్, వెంకటేష్ నేతల పేర్లే లేవు.

AICC Secretary and former MLA SA Sampath Kumar honored Malluravi and wished her well

సికింద్రాబాద్ సీటు ఆశించిన బొంతు రామ్మోహన్, పెద్దపల్లి సీటు ఆశించిన సిట్టింగ్ ఎంపీ బోరకుంట వెంకటేష్ నేత ఇద్దరికీ ఎంపీ టికెట్ ఇవ్వకుండా మొండి హస్తం చూపించింది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో బొంతు రామ్మోహన్, వెంకటేష్ నేత ఉన్నారు.

అయితే…సంపత్‌ కుమార్‌ వ్యతిరేకించిన మల్లు రవికి కూడా టికెట్‌ వచ్చింది. అయినప్పటికీ…గొప్ప మనసుతో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన మల్లు రవిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎ సంపత్ కుమార్. నాగర్ కర్నూల్ ఎంపీగా మల్లురవిని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు సంపత్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news