పంచాయితీ సెక్రటరీలపై సర్కార్ సీరియస్

-

తమ జాబ్ లు రెగ్యులరైజ్ చేయాలని జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఏప్రిల్ 28 నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 1 నుండి అన్ని కలెక్టరేట్ల ఎదుట దీక్షలకు కూర్చున్నారు. అయితే రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది.

ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. రేపు సాయంత్రం ఐదు గంటల లోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. విధుల్లో చేరకుంటే ఉద్యోగాలనుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా నోటీసులు జారీ చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం పంచాయతీ సెక్రటరీలు 11 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version