ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులపై సర్కార్ షాకింగ్ నిర్ణయం..!

-

ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగిస్తూ సంచలన నిర్ణయానికి వచ్చింది. సూర్య ఎంటర్ ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరూ కూడా ఈ నెలాఖరుకి ఫైబర్ నెట్ ఔట్ అవ్వనున్నారు. ఇక ముందు ఎలాంటి పొడగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఈ ఉద్యోగులంతా కూడా ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా జీతాలు తీసుకున్న పరిస్థితి ఉంది. దీనిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం దాదాపు 500 మందిని ఫైబర్ నెట్ నుంచి తొలగించింది. గత ప్రభుత్వం హయాంలో ఫైబర్ నెట్ లో భారీగా అవకతవకలు జరిగినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం ఒకవైపు అయితే.. మరోవైపు కనెక్షన్లు కూడా గణనీయంగా తగ్గిపోయినట్టు తేల్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా అమలు కావడం లేదని విమర్శలు వచ్చాయి. దీనిపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 

Read more RELATED
Recommended to you

Latest news