గ్రామపంచాయతీ లెక్కలు అడిగినందుకు ఆత్మహత్యాయత్నం చేసినన సర్పంచ్ !

-

సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండల పరిధి రేజింతల్ గ్రామంలో బుధవారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. సర్పంచ్ కుద్బుద్దీన్, కార్యదర్శి, వార్డు సభ్యులు హాజరయ్యారు. పంచాయతీ అభివృద్ధికి ఎన్ని నిధులు వచ్చాయి? ఏయె పనులు చేపట్టారు? వివరాలు కావాలని వార్డు సభ్యులు నిలదీశారు. దీంతో అభివృద్ధి పనులను వివరించాలని రికార్డులను పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ కి ఇచ్చారు. ఆమె వివరాలు వెల్లడిస్తూ ఉన్న సమయంలో వార్డు సభ్యులు, సర్పంచ్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీ నిధులతో పాటు ఇతర నిధులను తీసుకువచ్చి నా నిలదీస్తారా? అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న నన్నే అనుమానిస్తారా? అంటూ తీవ్ర మనస్తాపానికి గురైన సర్పంచ్ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయాడు.

రైతు వేదిక దగ్గరకు వెళ్లి అక్కడున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలను పట్టుకున్నాడు. విద్యుదాఘాతంతో కిందపడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన పలువురు చికిత్స నిమిత్తం గాంగ్వార్ చౌరస్తా లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది బీదర్ కు తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో బీదర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సభ్యులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ.. విద్యుత్ తీగలు పట్టుకోవడం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news