గుడ్ న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి నేరుగా గోవాకు రైలు

-

మీరు గోవాకు వెళ్లాలనుకుంటున్నారా..? ఐతే మీకో గుడ్ న్యూస్. సికింద్రాబాద్‌ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా రైలు సర్వీసు వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటివరకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి వీక్లీ సర్వీసు, కాచిగూడ నుంచి సాధారణ, ఏసీ, స్లీపర్‌ సర్వీసు గుంతకల్‌ వద్ద గోవా రైలుతో అనుసంధానమై వెళ్లేవన్న విషయం తెలిసిందే.

అయితే సికింద్రాబాద్‌ నుంచి నేరుగా గోవాకు రైలు నడపాలంటూ విజ్ఞప్తులు రావడంతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రైల్వేశాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో సికింద్రాబాద్ టు గోవా.. రైలు సర్వీసును ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏటా దాదాపు గోవాను సందర్శిస్తున్న 80 లక్షల మందిలో 20 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత వాహనాలకు చెక్ పట్టి హాయిగా ఫ్రెండ్స్తో కలిసి ట్రైన్లో వెళ్లే అవకాశం వచ్చింది. బుధ, శుక్ర వారాల్లో సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడిగామకు, గురు, శనివారాల్లో అటు నుంచి సికింద్రాబాద్‌కు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version