మంత్రి సీతక్కను కలిసిన నటి రెజీనా

-

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ప్రముఖ నటి రెజీనా కసాండ్రా కలిశారు. మంగళవారం రోజున సచివాలయంలో మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెజీనా.. తాము తలపెట్టిన ‘రూరల్ విమెన్ లీడర్ షిప్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి సీతక్కను ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రికి ఆహ్వానపత్రాన్ని అందించారు. అనంతరం మహిళా సాధికారత, సంరక్షణ వంటి పలు అంశాలపై మంత్రి సీతక్కతో ఆమె చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

రెజీనా ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో నటిస్తోంది. ఈ భామ శివ మనసులో శ్రుతి (ఎస్ఎంఎస్) అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లా నువ్వులేని జీవతం, పవర్, రారా కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అ!, అనే సినిమాల్లో నటించింది. ఈ భామ గత కొద్దిరోజులుగా టాలీవుడ్లో ఏ సినిమాకు సైన్ చేయలేదు. కానీ కోలివుడ్లో మాత్రం బిజీగా ఉంది. మరోవైపు పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version