ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి సంచలన నిర్ణయం తీసుకోనున్నారా..? ఆమె త్వరలోనే వీఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం కొత్త సీఎస్ గా ఓ సీనియర్ ఐఏఎస్ ను నియమించబోతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే.రామకృష్ణారావు నియమితులు కానున్నారు.
1990 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన వచ్చే ఆగస్టులో రిటైర్డ్ కానున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ లలో శశాంక్ గోయల్ తరువాత రామకృష్ణారావు సీనియర్ గా ఉన్నారు. ఆర్థిక శాఖలో ఈయన చేసిన సేవలు ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో అనుభవం తోడ్పడుతుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనను సీఎస్ గా నియమించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. గతంలో ఆయన నల్గొండ జాయింట్ కలెక్టర్ గా, గుంటూరు కలెక్టర్ గా పని చేశారు.